(విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో కార్యాలయంలో శిశుసంక్షేమాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న పోషక అభియాన్ మాసోత్సవాల్లో భాగంగా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం గర్భిణులకు శ్రీమంతం చేశారు. పిల్లలకు,గర్భిణులకు పోషక విలువలు గల ఆహారాన్ని అందించడంలో అంగన్వాడీలు, ఆరోగ్య కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.