రంగారెడ్డి, (విజయక్రాంతి): జిల్లాలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని విధాల చర్యలు చేపట్టామని కలెక్టర్ శశాంక తెలిపారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహిస్తున్న ఎంజీఐటీ ఇంజినీరింగ్ కళాశాలను కలెక్టర్ శశాంక సందర్శించి అభ్యర్థులకు ఏర్పాటు చేసిన సదుపాయాలు పరిశీలించారు. ఎగ్జామ్నేషన్ సూపర్ఇండెంట్ కు కలెక్టర్ సలహాలు, సూచనలు చేశారు. జిల్లాలో మొత్తం 8008 మంది అభ్యర్థులకు 11 కేంద్రాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.