calender_icon.png 5 October, 2024 | 6:55 PM

దళిత వర్గాల అభ్యున్నతికి వెంకటస్వామి కృషి అభినందనీయం

05-10-2024 03:51:16 PM

అధికారిక జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా...

ఆదిలాబాద్, (విజయక్రాంతి) : కేంద్ర మాజీ మంత్రి, స్వర్గీయ గడ్డం వెంకట స్వామి జయంతి వేడుకలను ఆదిలాబాద్ జిల్లాలో అధికారికంగా  ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా వెంకట స్వామి చిత్రాటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. సుదీర్ఘ కాలం పాటు కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన వెంకటస్వామి దళిత, బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కొనియాడారు. జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, తహసీల్దార్ శ్రీనివాస్, ఏవో రామిరెడ్డి, సూపరెండెంట్, వివిధ శాఖల అధికారులు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.