calender_icon.png 10 October, 2024 | 10:48 PM

సమీకృత గురుకుల పాఠశాల స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రతిక్ జైన్

10-10-2024 08:37:02 PM

కొడంగల్,(విజయక్రాంతి): కొడంగల్ మున్సిపల్ పరిధిలోని పాత కొడంగల్ గ్రామంలో గురువారం సమీకృత గురుకుల పాఠశాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్న క్రమంలో స్థల సేకరణ చేపట్టి భూమి ఫూజ శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లను తహసీల్దార్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో కలెక్టర్ పర్యటించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.