calender_icon.png 26 October, 2024 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల ఇంచార్జి ప్రిన్సిపాల్, అధికారులకు మెమో జారీ చేసిన కలెక్టర్

09-08-2024 09:52:30 PM

పెద్దాపూర్: జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కాలేజ్ పెద్దాపూర్ ఇన్చార్జి ప్రిన్సిపల్ మైపాల్ రెడ్డి అలాగే తెలంగాణ రెసిడెన్షియల్, జూనియర్ కళాశాల జగిత్యాల కన్వీనర్ ప్రిన్సిపాల్ డిసిఒ పి.శ్రీనివాస్ లపై క్రమశిక్షణ చర్యలు తీసుకొనుటకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మెమో జారీ చేశారు.

శుక్రవారం గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న ఏ. అనిరుద్ కడుపునొప్పితో అస్వస్థతకు గురి కాగా, ఆ విద్యార్థిని జగిత్యాల ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. అలాగే మోక్షిత్, హేమంత్ యాదవ్ అనే మరో ఇద్దరు 6వ తరగతి విద్యార్థులు కూడా అస్వస్థత గురి కాగా వారిని మెట్ పల్లి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగాను అధికారులకు మేము జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.