లక్షెట్టిపేట,(విజయక్రాంతి): మున్సిపాలిటీలోని ఎమ్మార్వో ఆఫీస్ ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ... చెరువులను పరిరక్షించడంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రతి చెరువుకు ఎస్టీఎల్ హద్దులను నిర్మించాలన్నారు. ముఖ్యంగా ఇటిక్యాల, బోట్లకుంట చెరువులకు ఎఫ్ టి ఎల్ నిర్మించాలని ఇరిగేషన్, రెవిన్యూ, మున్సిపాలిటీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.