calender_icon.png 13 March, 2025 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలి

12-03-2025 08:55:56 PM

ఇంటి పన్ను వసూలు వుంది శాతం వసూలు చేయాలి కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదేశాలు

సంగారెడ్డి,(విజయక్రాంతి): స్కీమ్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదేశించారు. బుధవారం  సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం నుంచి మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్కీమ్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (LRS) దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో లేఅవుట్ల రెగ్యులరైజేషన్ కోసం ప్రజలు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో, వాటిని త్వరగా పరిశీలించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఫోన్ కాల్ చేసి రెగ్యులరైజేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలియజేయాలనీ అన్నారు.ఈ నెల 31లోపు పూర్తి ఫీజు చెల్లించిన వారికి 25% రిబేట్ వర్తిస్తుందని స్పష్టమైన సమాచారం అందించాలని తెలిపారు.

పట్టణ,  గ్రామీణ ప్రాంతాల్లోని  ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, టాంటాం ద్వారా ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ప్రయోజనం కలిగేలా వేగంగా సమస్యలు పరిష్కరించి, రెగ్యులరైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇంటి పన్ను (హౌస్ టాక్స్) & ప్రాపర్టీ టాక్స్ వుంది శాతం వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయ వనరులను మెరుగుపరిచేందుకు పన్నుల వసూలు అత్యంత కీలకమని తెలిపారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించి, పన్నుల వసూళ్లు పూర్తిగా చేయాలని సూచించారు. ఇంటి పన్ను (హౌస్ టాక్స్) & ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పట్టణం, గ్రామంలో వుంది శాతం పన్ను వసూలు చేయాలనే లక్ష్యంగా పన్ను వసూలు చేయాలనీ తెలిపారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో  జిల్లా పంచాయతీరాజ్ అధికారి సాయిబాబా, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దారులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. బుధవారం కంది మండలం చేర్యాలలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్  క్రాంతి  వల్లూరు పరిశీలించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. కంది మండలం లో  పైలెట్ ప్రాజెక్టుగా చేర్యాల గ్రామాన్ని ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు. గ్రామం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక కావడంతో  జిల్లా స్థాయి అధికారుల నిఘా ఉంచి పనులు వేగవంతంగా జరిగేలా చూస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో 65 ఇళ్ళు మంజూరు చేయగా 12 ఇళ్ళు బెస్మిట్స్ స్థాయిలో ఉన్నట్లు ప్రస్తుతం మూడు ఇండ్లు నిర్మాణ స్థాయిలో ఉన్నట్లు అధికారుల బృందం వీటిని పరిశీలించింది. ఈ సందర్భంగా కలెక్టర్  తనిఖీ చేసి పనుల నాణ్యత, నియమ నిబంధనలు పాటించాలని అన్నారు. ఇల్లు పూర్తిగా లేని అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు ప్రభుత్వం ఇండ్లు నిర్మించి అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి ఇండ్లను 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని కలెక్టర్ తెలిపారు. 

మోడల్ హౌస్ ను పరిశీలించిన కలెక్టర్ క్రాంతి వల్లూరు

కంది మండలం కేంద్రంలో  గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన మోడల్ హౌజ్ను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం పరిశీలించారు. మోడల్ హౌస్ నిర్మాణం పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. మిగతా ఇండ్ల నిర్మాణం పనులు కూడా వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం పూర్తిగా ఇండ్లు నిర్మించి ఇస్తుండడంతో పతకం అమలు మరింత వేగంతో అవుతుందన్నారు. ప్రభుత్వ విధానాలు ఇది నిదర్శనం అన్నారు. లబ్ధిదారులు వీటి ప్రయోజనాలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పైలెట్ ప్రాజెక్టులో నీటిపారుదల వసతి మౌలిక వసతులు కల్పనతో పాటు ఇంటి పరిసరాలు మంచినీటి సరఫరా మురుగునీటి పాడుదల వ్యవస్థ విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులకు ఇండ్ల పథకంపై అవగాహన కల్పించి వారి ఇండ్ల నిర్మాణం మెరుగుపరిచేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అధికారులు ఇండ్ల నిర్మాణం నాణ్యత పై మరింత దృష్టి సారించాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయడం లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో పిడి హౌసింగ్ చలపతిరావు, ఏఈ మాధవరెడ్డి, తాసిల్దార్  విజయలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది సంబంధిత అధికారులు పాల్గొన్నారు.