calender_icon.png 23 October, 2024 | 7:07 AM

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

12-08-2024 02:13:02 PM

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష 

పెద్దపల్లి(విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణశ్రీ, జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ లతో కలిసి పాల్గొని ప్రజల అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. మంథని మండలం రచ్చపల్లి గ్రామానికి చెందిన నగావత్ రుకమ్మ తమ ఇల్లు, పోలం ఓపెన్ కాస్ట్ మైనింగ్ విస్తీర్ణంలో సింగరేణి ప్రాజెక్టు కింద స్వాధీనం చేసుకున్నారని, మాకు ప్రకటించిన ఆర్,ఆర్ ప్యాకేజీలో తన పేరు తన కుమారుని పేరు రాలేదని, తనకు తన కుమారుడికి సైతం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వచ్చేలా చూడాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా మంథని ఆర్డీఓకు రాస్తూ పరిశీలించి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు.