calender_icon.png 28 March, 2025 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టేకులపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్

25-03-2025 03:53:50 PM

మునగసాగు, ఫారం ఫాండ్ల పరిశీలన

టేకులపల్లి,(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్  జితేష్ వి పాటిల్ టేకులపల్లి మండలంలో మంగళవారం విస్తృతంగా పర్యటించారు. బోడు గ్రామపంచాయతీలో జరుగుచున్న రైతు సమ్మయ్య పొలంలో ఫారం పాండు పనిని పరిశీలించి కూలీలతో పాటు సరదాగా సుమారు 45 నిమిషాలు పనిచేసినారు. పక్కనే జరుగుతున్న రహదారి నిర్మాణం పనిని పరిశీలించి కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబం 100 రోజుల పని పూర్తి చేసుకోవాలని, ప్రతిరోజు ప్రతి కూలి 300 రూపాయలు కొలతల ప్రకారం పని చేసుకోవాలని సూచించారు. ఎక్కువ గంటలు పని చేయాలని, ఎండాకాలం దృష్ట్యా ఉదయాన్నే ఉపాధి పనులకు హాజరయ్యి పని చేసుకోవాలని కూలీలకు తెలిపారు. రైతులు రాబోయే రోజులలో నీటి ఎద్దడి దృష్ట్యా అందరూ ఫారం పాoడు నిర్మాణాలను పెద్ద ఎత్తున నిర్మించు కోవాలని, ఎక్కువ ఆదాయం వచ్చే మునగ పంటల సాగును చేపట్టాలని రైతులకు తెలిపారు. ముగ్గురు రైతులు యాదగిరి, రవి, శ్రీను లు సాగు చేస్తున్న 6 ఎకరాల మునగ తోట సాగును పరిశీలించి రైతులతో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎర్రాయిగూడెం గ్రామపంచాయతీ నందు ఉపాధి హామీ పథకంలో నూతనంగా నిర్మించిన రెండు పశువుల షెడ్లను గూగులత్ శాంతి, బీమ్ల షేడ్ లను పరిశీలించి వీటిని పశువుల కొరకు సద్వినియోగం చేసుకోవాలని రైతులను ఆదేశించారు. రైతులకు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్  లోకల్ బాఢీష్ /జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన మేడం, ఎంపీడీవో జి. రవీందర్, ఎంపీఓ గాంధీ, ఏవో అన్నపూర్ణ, ఏపీవో శ్రీనివాస్, ఈసీ తిరుపతయ్య, టిఏ ఈశ్వరి,  ఎఫ్ఏలు, కార్యదర్శిలు ఇతర శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.