యాదాద్రి భువనగిరి,(విజయక్రాంతి): ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు సత్వరమే కమిటీలను పూర్తిచేసి పంపాలని ఎంపీడీఓలకు జిల్లా కలెక్టర్ హనుమంతు కే. జండగే ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో కమిటీకి బాధ్యత ఉండటంతో కమిటీలను పారదర్శకంగా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా కార్యనిర్వాహక ముఖ్య ప్రణాళిక అధికారి శోభారాణి,మండల యమ్ పిడిఓలు పాల్గొన్నారు.