ఖమ్మం: ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం దిలావార్ పూర్ మండలం సిర్గాపూర్ శివారులోని 664 సర్వే నెంబర్ లో నూతనంగా నిర్మించనున్న సమగ్ర రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ స్థలాన్ని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తో కలిసి ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి అవసరమైన 17 ఎకరాల స్థలానికి ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సర్వే నెంబరును సరిహద్దులను పరిశీలించి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రత్న కళ్యాణి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ ఎడి ఆర్ సుదర్శన్, తహసిల్దార్ స్వాతి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.