calender_icon.png 29 September, 2024 | 4:46 AM

ట్రాన్స్‌జెండర్ల వేషధారణలో వసూళ్లు

28-09-2024 01:57:22 AM

పోలీసుల అదుపులో నిందితులు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ట్రాన్స్‌జెం డర్ల వేషధారణలో ముఠాగా ఏర్పడి దుకాణాలు, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఏడుగురుని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం, హిందూపూర్, అనంతపురం ప్రాంతాలకు చెందిన ఎస్.కుమార్ అలియాస్ సూరదా చాందిని(45), నల్లన్నగారి రమేష్ అలియాస్ జయశ్రీ(29), యేటప్పగారి మల్లేశ్ అలియాస్ మనీషా (25).. ట్రాన్స్‌జెండర్ల వేషధారణలో హైదరాబాద్ నగరం యాప్రాల్‌లోని బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్నారు.

గతకొంతకాలంగా వీరు.. స్థానికులైన సురేష్(35), బాషా(39), షఫీ(45), ఇషాక్(29)తో కలిసి ట్రాఫిక్ జంక్షన్లు, దుకాణాలు, ఇతర శుభకార్యాల వద్ద బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. వెకిలి చేష్టల తో వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పలువురి ఫిర్యాదుల ఆధారంగా కార్ఖానా పోలీసులు శుక్రవారం మాయాబజార్ హోటల్ వద్ద వీరిని అరెస్ట్ చేశారు.