calender_icon.png 6 March, 2025 | 3:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్‌ఎఫ్ పేద, మధ్యతరగతి ప్రజలకు గొప్ప వరం

06-03-2025 12:00:00 AM

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, మార్చ్ 5(విజయక్రాంతి): సీఎంఆర్‌ఎఫ్ ఎల్వోసీ పేద మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక  పెద్ద భరోసా కల్పిస్తుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ అరేకపూడి గాంధీ అన్నారు.

మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ కి చెందిన నల్లపరాజు సీత మహాలక్ష్మి  అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా  సీఎంఆర్‌ఎఫ్ ద్వారా మంజూరైన రూ.2,50,000/- రెండు లక్షల యాభై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని బుధవారం ఎమ్మెల్యే నివాసంలో బాధితురాలికి చెక్కు రూపేణా అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని పేర్కొన్నారు. అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ,అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని తెలిపారు.

ఈ మేరకు వైద్య చికిత్సకు సహకారం అందించిన ఎమ్మెల్యే అరేకపూడి గాంధీకి బాధితురాలు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు  ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ,జంగయ్య యాదవ్,శ్రీధర్ రెడ్డి, తిరుపతి, మధు, రాజయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.