04-04-2025 06:16:30 PM
పెద్ద కొడప్గల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కోడప్గల్ మండలం కాటేపల్లి గ్రామంలో లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందజేశారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిప్ప మోహన్ మాట్లాడుతూ... పేదల పెన్నిధి సిఎంఆర్ఎఫ్ అని పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో నీరుడి అశోక్ రూ. 21 వేలు, రీమా బాయి రూ 32 వేలరూపాయల సిఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డి పేదల వైద్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని పదిలక్షలరూపాయలు పెంచి బీద ప్రజలను ఆదుకుంటుందని తెలిపారు.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ముఖ్యమంత్రి సహాయ నిధి సాయాన్ని బాధితులకు అందజేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు.ఈ కార్య క్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ గోకన్ గంగాగౌడ్,కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మొహిద్దిన్ పటేల్,నాయకులు మల్లప్ప పటేల్,ఇస్మాయిల్ పటేల్,యూసఫ్ పటేల్,పాండు నాయక్,బార్థ్యానాయేక్, శేక్ చాంద్ పాషా, శంకర్, పర్వయ్య,మొగులయ్య, రియాజ్ పటేల్, సుధార్, కుమార్,రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.