04-04-2025 09:27:50 PM
దౌల్తాబాద్,(విజయక్రాంతి): మండల పరిధిలోని గాజులపల్లి గ్రామానికి చెందిన బోయిని వెన్నెలకు రూ.49,500 సీఎంఆర్ఎఫ్ చెక్కును బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పంజా స్వామి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యానికి కొండంత ఆర్థిక భరోసాగా సీఎంఆర్ఎఫ్ నిలుస్తుందని అన్నారు. ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వడ్ల చందు,రవీందర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, బాలచంద్రం,భాస్కర్, కనకయ్య, సుధాకర్, బిక్షపతి, గంగయ్య, కనకా రెడ్డి, యాదయ్య, సంపత్,యేసు తదితరులు పాల్గొన్నారు.