calender_icon.png 28 September, 2024 | 12:55 PM

నిజామాబాద్‌లో సీఎంఆర్ స్టోర్

28-09-2024 01:11:47 AM

నిజామాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27(విజయక్రాంతి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల్లో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ అయిన సీఎంఆర్ టెక్స్‌టైల్స్, జ్యూయలర్స్ ప్రై.లి., సీఎంఆర్ షాపింగ్ మాల్ 35వ స్టోర్‌ను నిజామాబాద్‌లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ శుక్రవారం పారంభించారు. ఈ సందర్భంగా సీఎంఆర్ ఫౌండర్, చైర్మన్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ.. 4దశాబ్దాలుగా తమ సంస్థను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు.

ప్రజలకు అన్ని వేడుకలకు కావలసిన వస్త్రాలు తమ షాపింగ్ మాల్‌లో తక్కువ ధరకే అందిస్తున్నామని తెలిపారు. తమ సొంత మగ్గాలపై నేసిన వస్త్రాలను మరెవరూ ఇవ్వని తక్కువ ధరలకు అందిస్తున్నామన్నారు. సీఎంఆర్ ఎండీ మావూరి మోహన్‌బాలాజీ మాట్లాడుతూ నిజామాబాద్‌లో తమ షోరూమ్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.

సినీహీరో రామ్ పోతినేని, సినీతార పాయల్ రాజ్‌పుత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సెల్ఫీలు తీసుకుని అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్బంగా వారు  మాట్లాడుతూ వస్త్ర వ్యాపార రంగంలో సీఎంఆర్ అగ్రగామిగా నిలిచిందన్నారు. అన్ని రకాల వెరైటీలు సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయన్నారు.