04-03-2025 12:56:03 AM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్
కామారెడ్డి, మార్చి 3 (విజయక్రాంతి) : కస్టమ్స్ మిల్లింగ్ రైస్ సేకరణ త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నా రు. సోమవారం పౌర సరఫరాల అధికారుల తో తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2023- రబీ, 2024- 25 ఖరీఫ్ కాలమునకు సంబంధించిన సి.ఏం.ఆర్. సేకరణకు మిల్లులను తనిఖీ చేయాలనీ అన్నారు. సహా య పౌరసరఫరాల అధికారులు, ఎన్ ఫోర్స్ డిప్యూటీ తహ సీల్దార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి సి.ఏం. ఆర్. సేకరణకు మిలర్లపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.
క్షేత్ర స్థాయి సిబ్బంది పనితీ రు మెరుగుపరచుకోవాలని, అలసత్వం ప్రదర్శించిన వారిపై చర్యలు చేపట్టాలని అన్నా రు. సి.ఏం.ఆర్. సరఫరా చేయని మిల్లుల యజమానులకు నోటీసులు జారీచేయాలని తెలిపారు. 2023- రబీ సీజన్లో 122064 టన్నుల డెలివరీ చేసి 58 శాతం పూర్తి చేసినారని, 94,295 టన్నుల సి.ఏం.ఆర్. ను మార్చి 17 నాటికి వంట శాతం పూర్తి చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య, తదితరులు పాల్గొన్నారు.