మందకృష్ణ మాదిగ
కామారెడ్డి(నిజామాబాద్), అక్టోబర్ 16 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణను సీఎం రేవంత్రెడ్డి తొక్కి పెడుతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన ఎమ్మార్పీస్, ఎంసీపీ అనుబంధ విభాగ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడారు.
అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణను స్వాగతించిన సీఎం రేవంత్రెడ్డి దానిని అమలు చేయకుండా తొక్కి పెడుతున్నారన్నారు. మాదిగలను మోసంచేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తీసుకునే నిర్ణ యాలపైనే భవిష్యత్ కార్యాచరణ ఆధారపడి ఉంటుందని తెలిపారు. రేవంత్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తామని హెచ్చరించారు.