ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ చెన్నయ్య
ఆదిలాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు చేపట్టిన బస్సుయాత్ర శుక్రవారం ఆదిలాబాద్కు చేరుకున్నది. ఈ సందర్భంగా సభ్యులకు జిల్లా మాల సంక్షేమ సంఘం నాయకులు సాగతం పలికారు. అనంతరం స్థానిక బీఆర్ అంబేద్కర్ భవన్లో ఆదిలాబాద్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశాన్ని నిరహించారు.
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ర్ట చైర్మన్ చెన్నయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎస్సీ వర్గీకరణ పై ఉన్న ఆసక్తి, మ్యాఫెస్టోలో పెట్టిన దళిత డిక్లరేషన్, సంక్షేమ పథకాల అమలుపై ఎందుకు లేదని ప్రశ్నించారు. మాలలపై ముఖ్యమంత్రి దేషాన్ని విడనాడాలని కోరారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నవంబర్ 24న హైదరాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.