calender_icon.png 21 September, 2024 | 5:56 PM

బీజేపీ అనుకుంటే సీఎం పదవి పోతుంది: కేటీఆర్

21-09-2024 03:34:34 PM

హైదరాబాద్: బీజేపీ అనుకుంటే సీఎం రేవంత్ రెడ్డి పదవి పోతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అమృత్ పథకంలో సీఎం కుటుంబ సభ్యులు అవినీతి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం తన అధికారాన్ని ఉపయోగించి బావమరిదికి పనులు అప్పగించారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీకి రూ. 1.137 కోట్ల పనులు అప్పగించారని కేటీఆర్ విమర్శించారు. రూ. 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ రూ. వెయ్యి కోట్ల విలువైన పనులు చేస్తుందా..? కేటీఆర్ ప్రశ్నించారు. అమృత్ పథకంలో జరిగిన టెండర్ల వివరాలను ప్రభుత్వం బయట పెట్టట్లేదన్నారు.

అమృత్ పథకం టెండర్లపై కేంద్రం విచారణ జరిపించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన అమృత్ పథకం టెండర్లను రద్దు చేయాలన్నారు. అమృత్ పథకం టెండర్లు అవినీతిపై కేంద్రానికి లేఖ రాశామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి లేకుంటే అమృత్ పథకం టెండర్లపై విచారణ చేయాలని కోరారు. ఫిబ్రవరి నుంచి జీవోలు వెబ్ సైట్ లో పెట్టట్లేదని కేటీఆర్ పేర్కొన్నారు. హైడ్రాను అడ్డుపెట్టుకొని ఎలా బెదిరిస్తున్నారో బయటపెడతామన్నారు. ప్రభుత్వం చేసిన అక్రమాలన్నీ బయటపెడతామని హెచ్చరించారు.