హైదరాబాద్ అభివృద్ధిపై ఏమాత్రం పట్టింపు లేదు
మల్కాజిగిరి ఎంపీ
ఈటల రాజేందర్
రాజేంద్రనగర్, అక్టోబర్ 24: సీఎం రేవంత్రెడ్డి డబ్బు సంచుల కోసమే పనిచేస్తున్నాడని, హైదరాబాద్ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూలుస్తామంటే సహించేది లేదని, బీజేపీ బాధితులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. గురువారం అత్తాపూర్లోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి పర్యటించిన ఈటల.. మూసీ బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, పేదల ఇళ్లను కూల్చి సుందరీకరణ చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదని లేదన్నారు. పేదల భూములు లాక్కొని పెద్దలకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలను విస్మరించారని, వాటిని మరిపించేందుకే మూసీ సుందరీకరణ అంటూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు తోకల శ్రీనివాస్రెడ్డి, వై శ్రీధర్, మోండ్ర కొమురయ్య, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.