11-04-2025 12:57:39 PM
హైదరాబాద్: సామాజిక ఉద్యమాలకు మార్గదర్శి, బహుజన చైతన్య దీప్తి, వివక్షలపై పోరాడి, మహిళా విద్యకు విశేష కృషి చేసిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి( Mahatma Jyotiba Phule Birth Anniversary) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. పూలే స్ఫూర్తితో సామాజిక సాధికారత కోసం తెలంగాణలో సమగ్ర కుల గణన చేపట్టడం, బీసీలకు 42శాతం రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ వంటి అనేక నిర్ణయాలు తీసుకున్న విషయాలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు.