calender_icon.png 1 October, 2024 | 5:08 AM

ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి

01-10-2024 02:24:08 AM

  1. నేడు ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు పరామర్శ 
  2. ఆ తర్వాత హైడ్రా, మూసీనదీ ప్రక్షాళనపై పార్టీ పెద్దలతో చర్చ

హైదరాబాద్, సెప్టెంబర్ 30(విజయక్రా ంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవా రం ఢిల్లీకి వెళ్లారు. ఇటీవల జమ్ముకశ్మీర్ అ సెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గు రైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను మంగళవారం  ఆయన పరామర్శించను న్నారు. ఆ తర్వాత ఢిల్లీలోని పార్టీ ముఖ్య నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం కా నున్నారు.

ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణల కూల్చివేతకు గాను ఏర్పాటు చేసిన హైడ్రాపై, మూసీ ప్రక్షాళన తదితర అంశాలపై పార్టీ ఢిల్లీ పెద్దలకు వివరించనున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను పార్టీ పెద్దల దృష్టికి సీఎం తీసుకుపోనున్నారు. ఢిల్లీ పెద్దలతో భేటీ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి తిరిగి సాయంత్రం హైదరాబాద్‌కు వస్తారు.