హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఫైనల్ కీతో పాటు ఫలితాలు కూడా టీజీపీఎస్సీ విడుదల చేసింది. గ్రూప్-1 మెయిన్స్ కు అర్హత సాధించిన 31,382 మంది అభ్యర్థులకు తెలంగాణ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు జరిగే గ్రూప్-1 మెయిన్స్ లో కూడా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
మెయిన్స్ కు అర్హత సాధించనివారు నిరుత్సాహపడవద్దని ఆయన ధైర్యం చెప్పారు. జీవితంలో లక్ష్యాన్ని నిర్ధేశించుకోని విజయం సాధించే వరకు ప్రయత్నించాలన్నారు. రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9వ తేదీన టీజీపీఎస్సీ నిర్వహించింది. ప్రిలిమ్స్ ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. 1:50 నిష్పత్తిలో మెయిన్స్ అభ్యర్థులను కమిషన్ ఎంపిక చేసినట్లు తెలిపింది.