calender_icon.png 29 October, 2024 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-1 ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్

07-07-2024 05:01:27 PM

హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఫైనల్ కీతో పాటు ఫలితాలు కూడా టీజీపీఎస్సీ విడుదల చేసింది. గ్రూప్-1 మెయిన్స్ కు అర్హత సాధించిన 31,382 మంది అభ్యర్థులకు తెలంగాణ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు జరిగే గ్రూప్-1 మెయిన్స్ లో కూడా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

మెయిన్స్ కు అర్హత సాధించనివారు నిరుత్సాహపడవద్దని ఆయన ధైర్యం చెప్పారు. జీవితంలో లక్ష్యాన్ని నిర్ధేశించుకోని విజయం సాధించే వరకు ప్రయత్నించాలన్నారు. రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9వ తేదీన టీజీపీఎస్సీ నిర్వహించింది. ప్రిలిమ్స్ ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. 1:50 నిష్పత్తిలో మెయిన్స్ అభ్యర్థులను కమిషన్ ఎంపిక చేసినట్లు తెలిపింది.