calender_icon.png 5 October, 2024 | 2:49 PM

కాకాకి సీఎం రేవంత్ రెడ్డి నివాళి

05-10-2024 11:56:09 AM

హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు, కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాకా) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహానాయకుడికి నివాళులు అర్పించారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారుడిగా, సింగరేణి బాంధవుడిగా, కార్మిక పక్షపాతిగా వెంకటస్వామి ఎనలేని సేవలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. ట్యాంక్ బండ్ వద్ద జి. వెంకటస్వామి జయంతి వేడుకలు నిర్వహించారు. ట్యాంక్ బండ్ పై కాకా విగ్రహానికి శ్రీథర్ బాబు, పొంగులేటి, సీతక్క, జానారెడ్డి, శంకర్ రావు పూలమాలు వేసి నివాళులర్పించారు. అటు రాష్ట్రవ్యాప్తంగా వెంకటస్వామి జయంతి వేడుకలు జరుగుతున్నాయి.