హైదరాబాద్: తెలంగాణ సాధన కోసం తొలి, మలి దశ పోరాటంలో కీలక భూమిక పోషించిన స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ 12 వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి నివాళులర్పించారు. స్వతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ కోసం సర్వస్వం ధారపోసిన త్యాగశీలి బాపూజీ అని స్మరించుకున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా శనివారం ఉదయం 10 గంటలకు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు ట్యాంక్ బండ్ పై ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులతో కలిసి నివాళులు అర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడిన నాయకుడు, బడుగు, బలహీనవర్గాలకు స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని కాంగ్రెస్ నేతలు అన్నారు.