15-04-2025 08:59:14 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం రాత్రి జపాన్ పర్యటనకు బయలుదేరనుంది. ఏప్రిల్ 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ముఖ్యమంత్రి బృందం జపాన్ లోని టోక్యో, మౌంట్ ఫ్యూజీ, ఒసాకా, హిరోషిమా తదితర నగరాల్లో పర్యటించనుంది. ఒసాకా వరల్డ్ ఎక్స్పో -2025 లో తెలంగాణ పెవీలియన్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు.
అనంతరం జపాన్కు చెందిన ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక వేత్తలు, ప్రతినిధులతో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమై చర్చించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక సాంకేతిక రంగాల్లో సహకారం ప్రధాన ఉద్దేశంగా సాగుతున్న ఈ పర్యటనలో పలు సంస్థలతో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం చర్చలు జరుపుతుంది. అధికారుల బృందం సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఉంటారు.