calender_icon.png 26 October, 2024 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైఎస్‌ఆర్‌ను మేం కుటుంబ సభ్యుడిలా భావిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

08-07-2024 08:30:19 PM

అమరావతి : మంగళగిరి సీ.కే. కన్వెన్షన్ సెంటర్ లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు తెలంగాణ నుంచి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీథర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దీపాదాస్ మున్షీ, కొండా సురేఖ హాజరయ్యారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... వైఎస్ఆర్ జయంతి సభకు వెళ్లాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లీకార్జున ఖర్గే తనను కోరినట్లు ఆయన తెలిపారు. అనివార్య కారణాల వల్ల ఖర్గే ఈ సభకు రాలేకపోయారని, వైఎస్ఆర్ ను తాము కుటుంబ సభ్యుడిలా భావిస్తున్నామన్నారు.  ఎన్ని ఏళ్లు గడిచినా వైఎస్ ను మరిచిపోలేం అని, అభివృద్ధి, సంక్షేమం అంటే వైఎస్ గుర్తుకు వస్తారని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ అభిమానులకు కొదవలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.