calender_icon.png 18 October, 2024 | 3:59 PM

అప్పుల లెక్కలు చెప్పిన హరీశ్.. అమ్మకాల లెక్కలు చెప్పట్లేదు

27-07-2024 11:29:32 AM

హైదరాబాద్: లక్షల కోట్ల విలువైన ఓఆర్ఆర్ ను రూ. 7కోట్లకు అమ్మారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. రూ. 700 కోట్లు గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి జరిగిందన్నారు. అప్పుల లెక్కలు చెప్పిన హరీశ్ రావు, అమ్మకాల లెక్కలు చెప్పట్లేదని ప్రశ్నించారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పదేళ్లలో పూర్తి చేయలేదన్నారు. కేసీఆర్ పాలనలో రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్మకున్నారని తెలిపారు.