calender_icon.png 21 October, 2024 | 1:38 PM

పోలీసుల పాత్ర ఎనలేనిది

21-10-2024 10:50:25 AM

దేశభద్రత, ప్రజల రక్షణలో పోలీసుల పాత్ర ఎనలేనిది

అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండ

పోలీసుల పాత్ర కీలకం


హైదరాబాద్: హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో పోలీసు సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. పోలీసుల ఫ్లాగ్ డే పరేడ్ కు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... విధినిర్వహణలో అమరులైన పోలీసులకు సీఎం ఘన నివాళులు అర్పించారు. దేశ భద్రత, ప్రజల రక్షణలో పోలీసుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సజావుగా ఉన్నాయంటే పోలీసులే కారణం అన్నారు. ఏ రాష్ట్రమైన అభివృద్ధి చెందేందుకు శాంతిభద్రతలే కీలకమన్నారు. పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు అదుపులో ఉండాలని చెప్పారు.

శాంతిభద్రతలు, నిఘా విషయంలో రాష్ట్ర పోలీసుల పాత్ర కీలకం అన్నారు. ఈ కార్యక్రమం.. అమరుల కుటుంబాలను ఆదుకుంటామనే నమ్మకం ఇస్తోందన్నారు. అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పెరుగుతున్న ఆధునిక సాంకేతికత ద్వారా నేరాలు చేస్తున్నారు.. నేరగాళ్లు సరికొత్త విధానాలతో ముందుకొస్తున్నారని సీఎం తెలిపారు. తెలంగాణ పోలీసులు విధానాలను ఇతర రాష్ట్రాలు పాటిస్తున్నాయని ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. మన ఫోరెన్సిక్ ల్యాబ్ అనేక రాష్ట్రాలకు ఆదర్శం, మన సైబర్ క్రైమ్ విభాగం దేశంలోనే గొప్పదని కేంద్ర హోంశాఖ అభినందించిందని ముఖ్యంత్రి స్పష్టం చేశారు.