హైదరాబాద్: తెలంగాణ సంస్కృతికి ప్రతీక. తొమ్మిది రోజులు తీరొక్క పూలతో గౌరమ్మను ఘనంగా పూజించి, సకల జనులు, సబ్బండ వర్ణాలు సమైక్య స్పూర్తిని చాటే సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. పూలను పూజించి, ప్రకృతిని ఆరాధించే మన సంస్కృతిని ప్రతిబింబిస్తూ, ఇంటిల్లిపాది ఏకమై, రంగు రంగుల పూలను పేర్చి, ఊరువాడా ఒక్కచోట చేరి, మన ఆడబిడ్డలు ఎంతో ఆనందంగా జరుపుకునే బతుకమ్మ పండుగను తెలంగాణలో ఘనంగా నిర్వహిస్తారు.