calender_icon.png 10 October, 2024 | 7:58 PM

ఆదాయం పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

10-10-2024 05:10:55 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆదాయం సమకూర్చే శాఖల లక్ష్యాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ శాఖల ఉన్నతాధికారులతో గురువారం సమీక్షించారు. తెలంగాణ రాష్ట్ర వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయ పెంపు మార్గాలపై దృష్టిని సారించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వార్షిక లక్ష్యాలను చేరుకోవడంలో శాఖల పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ సీఎస్ శాంతి కుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.