హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో డీఎస్సీ ఫలితాలను సోమవారం విడుదల చేశారు. మార్చి 1న 11,602 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయింది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. 2.45 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలు రాశారు. పరీక్షలు ముగిసిన 56 రోజుల వ్యవధిలోనే ఫలితాలు విడుదల అయ్యాయి.