06-04-2025 11:27:49 AM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీపీఎల్ హెలిపాడ్ లో 11 గంటలకు సారపాకకు విచ్చేశారు. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్, ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులు ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు.11:05 నిమిషాలకు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మండపానికి బయలుదేరారు. కాసేపట్లో ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్తాలు సమర్పించనున్నారు.