11-12-2024 03:20:27 PM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైపూర్ చేరుకున్నారు. రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు. బంధువుల వివాహం కోసం సీఎం జైపూర్ కు వెళ్లారు. రేవంత్ రెడ్డి బుధవారం నుంచి మూడు రోజుల పర్యటన నిమిత్తం జైపూర్తో పాటు న్యూఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. జైపూర్ తర్వాత ముఖ్యమంత్రి గురు, శుక్రవారాల్లో న్యూఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. దేశ రాజధానిలో రెండు పర్యటనల సందర్భంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో పాటు పార్టీ సీనియర్ నేతలను కూడా కలవనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్తో పాటు ఇతర సీనియర్ నేతలు కూడా ఢిల్లీకి వెళ్లనున్నట్లు కాంగ్రెస్ పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి తన ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై హైకమాండ్తో చర్చించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.