హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో కులసర్వే నివేదిక(Caste Survey Report)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ప్రవేశపెట్టారు. అనంతరం కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై రేవంత్ రెడ్డి వివరించారు. సామాజి, ఆర్థిక ఉపాధి, విద్య, రాజకీయ కులసర్వే నివేదిక ప్రవేశపెడుతున్నానని, సమగ్ర ఇంటింటి కులసర్వే(Samagra Intiti Kutumba Survey) నిర్వహించాలని ఫిబ్రవరి 2024లో నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కర్ణాటక, బిహార్ సహా వివిధ సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేశామని, సర్వేల తయారీలో వివిధ సంఘాలు, మేధావుల అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాల్లో, పట్టణాల్లో 45.15 లక్షల కుటుంబాల్లో సర్వేలు దాదాపు 50 రోజుల పాటు జరిగిందని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 1.12 కోట్ల కుటుంబాల సర్వే జరిగిందన్నారు. జనగణన కంటే పకడ్బందీగా కులగణన సర్వే చేశామన్నారు. రాష్ట్రంలో సర్వే చేసిన ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికించారని, ఒక ఎన్యుమరేటర్ రోజుకు 10 ఇళ్ల కంటే ఎక్కువ ఇళ్లు సర్వే చేయలేదని సీఎం పేర్కొన్నారు.
మొత్త సర్వే ప్రకారం ఎస్పీలు, 61,84,319 మంది ఉండగా.. 17.43 శాతంగా ఉన్నారని, బీసీలు (ముస్టిం మైనార్టీ మినహా) 1,64,09,179 మంది ఉండగా.. 46.25 శాతం, ఎస్టీలు 37,05,929 మంది 10.45 శాతం, ముస్లీం మైనార్టీలు 44,57,012 మంది 12.56 శాతం ఉన్నారు. ముస్లీం మైనార్టీల్లో బీసీలు 35,76,588 మంది 10.08 శాతం, ముస్లీం మైనార్టీల్లో ఓసీలు 8,80,424 మంది 2.48 శాతం, ఓసీలు 56,01,539 మంది 15.79 శాతం, ముస్లీం మైనార్టీలు మినహా ఓసీలు 47,21,115 మంది 13.31 శాతం ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కుల సర్వే డేటాను సంక్షేమ విధానాల తయారీకి వాడుతామని సీఎం వెల్లడించారు.