calender_icon.png 27 September, 2024 | 4:55 PM

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి.. సీఎం నివాళులు

27-09-2024 01:29:26 PM

హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ కోసం సర్వస్వం ధారపోసిన త్యాగశీలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేక్, మైనంపల్లి రోహిత్, శాట్ చైర్మన్ శివసేనా రెడ్డిలు కూడా కొండా లక్ష్మణ్ బాపూజీకి పుష్పాంజలి ఘటించారు.