హైదరాబాద్: గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం పింక్ పవర్ రన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎంతో పాటు పింక్ పవర్ రన్ కార్యక్రమానికి అరెకపూడి గాంధీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పరుగులో ఐటీ, ఇతర ప్రైవేట్ ఉద్యోగులు పాల్గొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించడంలో భాగంగా కార్యక్రమానికి నిర్వహించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో స్థానం సంపాదించేందుకు పెద్ద ఎత్తున చేపట్టారు. మంత్రి దామోదర రాజనర్సింహ 3కే, 5కే, 10కే పరుగు ప్రారంభించారు. ఎంఈఐఎల్, సుధారెడ్డి ఫాండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పింక్ పవర్ రన్ విజేతలకు సీఎం రేవంత్ బహుమతులు అందజేశారు.