calender_icon.png 22 October, 2024 | 1:57 AM

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన

21-10-2024 07:34:55 PM

హైదరాబాద్‌,(విజయక్రాంతి): యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. గండిపేటలో మంచిరేవుల వద్ద యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పోలీసులు, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. హోంగార్డు నుంచి డీజీపీ వరకు పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... పోలీసుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుందని, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ఆదర్శనీయంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. గత పదేళ్లలో గ్రూప్-1 పరీక్షలు నిర్వహించలేదని, మా ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే గ్రూప్-1 పరీక్షలు నిర్వహిస్తున్నామని శ్రీధర్ బాబు చెప్పారు. గ్రూప్-1 అభ్యర్థుల్లో అనుమానాలు సృష్టించారని, ఈ పరీక్షతో ప్రభుత్వ ప్రతిష్ఠ పెరుగుతుందని ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి. పదేళ్లపాటు గ్రూప్-1 పరీక్షనిర్వహించకుండా ఏ రాష్ట్రం లేదని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.