calender_icon.png 25 October, 2024 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పన్నుల వాటాల్లో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష

25-10-2024 06:40:19 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): పన్నుల వాటాల్లో దక్షిణాది రాష్ట్రాలకు హక్కుగా రావలసిన నిధుల విషయంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశం ప్రగతిబాటలో పయనించడానికి అన్ని రాష్ట్రాలు సమంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ద సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రగతిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర, రైజింగ్ హైదరాబాద్ రైజింగ్ తెలంగాణ లక్ష్యాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా మూసీ రివర్‌ ఫ్రంట్ డెవలప్‌ మెంట్, ఫ్యూచర్ సిటీ ఆలోచనలను వివరించారు. సబర్మతి రివర్ ఫ్రంట్‌ కు మద్దతునిస్తున్న వారు మూసీ పురుజ్జీవాన్ని వ్యతిరేకిస్తున్నారని సీఎం ఆక్షేపించారు. మూసీ, ఈసా నదుల కలయిక ప్రాంతమైన బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యుత్తమంగా గాంధీ స్మారకాన్ని నిర్మించతలపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి కాంగ్రెస్ ప్రధానులు దేశంలో తీసుకొచ్చిన అనేక సంస్కరణల ఫలితాలను వివరించారు.

ప్రధానంగా బహుళార్థ సాధక ప్రాజెక్టులు, విద్య, హరిత విప్లవం, బ్యాంకుల జాతీయకరణ, 73-74వ రాజ్యాంగ సవరణలు, శాస్త్ర సాంకేతిక రంగంలో తీసుకొచ్చిన విప్లవం, 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పన, ఆర్థిక సంస్కరణలు వంటివి దేశ ప్రగతికి ఏ విధంగా తోడ్పతోందన్నాని విడమరిచి చెప్పారు. ఎంతో మంది యువకుల ప్రాణ త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రగతి విషయంలో కొంతమంది అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. యువకుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణను... రైజింగ్ తెలంగాణగా, రైజింగ్ హైదరాబాద్‌గా తీర్చిద్దడంలో అందరూ సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.