calender_icon.png 20 October, 2024 | 4:00 PM

రిస్క్ లేకుండా గొప్ప విజయాలు సాధించలేం: సీఎం రేవంత్

20-10-2024 12:49:42 PM

హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో కార్యక్రమంలో ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రిస్క్ లేకుండా గొప్ప విజయాలు సాధించలేమని తెలిపారు. త్యాగాలు చేయకుండా గొప్ప నేతలు కాలేమని వెల్లడించారు. మంచి నాయకుడు కావాలంటే ధైర్యం, త్యాగం రెండు ఉండాలని సూచించారు. ప్రజలతో మమేకమై ఏదైనా సాధించవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. ఇతర రాష్ట్రాలతో తెలంగాణను పోల్చలేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. న్యూయార్క్, లండన్ తో తెలంగాణను పోల్చాలనుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రాంచౌదరి హాజరయ్యారు.