calender_icon.png 19 October, 2024 | 2:50 PM

గీతారెడ్డికి అవార్డు రావడం సంతోషం

19-10-2024 12:42:37 PM

హైదరాబాద్‌: చారిత్రాత్మక చార్మినార్ వద్ద 34వ రాజీవ్ గాంధీ సద్భావనా యాత్రా స్మారక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... గీతా రెడ్డికి అవార్డు రావడం సంతోషంగా ఉంది.. అవార్డు ఇచ్చిన కమిటీ సభ్యులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. 1990 లో భారత్ సద్భావనా యాత్రను రాజీవ్ గాంధీ ప్రారంభించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో తాను పోటీ చేయలేను అని గీతారెడ్డి చెప్పారని ముఖ్యమంత్రి తెలిపారు. గాంధీ కుటుంబం ఉంటే.. పేదలకు న్యాయం జరుగుతోందన్నారు. దేశం కోసం ఆస్తులు, సంపదను గాంధీ కుటుంబ త్యాగం చేసిందన్నారు. పదవులను త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానికి దక్కుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. పదవులను గొప్ప వ్యక్తులకు ఇచ్చిన ఘనత సోనియా గాంధీ, రాహుల్ గాంధీకే దక్కుతుందని సీఎం హర్షం వ్యక్తం చేశారు.