హైదరాబాద్: సచివాలయంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి మంత్రి శ్రీధర్ బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా, కో చైర్మన్ శ్రీను రాజు, సీఎస్ శాంతి కుమారి, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... స్కిల్ వర్సిటీ నిర్వహణకు రూ. 100 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. వర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు. స్కిల్ వర్సిటీ నిర్వహణకు అందరూ సహకారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. వర్సిటీకి సంబంధించిన కీలక అంశాలను పారిశ్రామికవేత్తలకు వివరించి, స్కిల్ వర్సిటీలో కోర్సుల వివరాలను తెలిపారు.