calender_icon.png 21 September, 2024 | 11:22 PM

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో ముఖ్యమంత్రి రేవంత్ సమావేశం

19-09-2024 03:29:34 PM

హైదరాబాద్‌:  తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ భేటీకి మంత్రి శ్రీధర్ బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా, కో చైర్మన్ శ్రీనిరాజు, సీఎస్‌ శాంతి కుమారి, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇది రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను పెంపొందించే ప్రణాళికలు, వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. అంతకు ముందు ముఖ్యమంత్రి సచివాలయంలో పౌరసరఫరాల శాఖ అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించి ఆహార పంపిణీ, ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు.