calender_icon.png 11 October, 2024 | 5:55 PM

సమీకృత గురుకుల పాఠశాల భవనాలకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి

11-10-2024 03:46:32 PM

రంగారెడ్డి,విజయక్రాంతి: కొందుర్గ్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమీకృత గురుకుల పాఠశాల భవనాలకు ఇవాళ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఒక్కరోజే 28 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలలకు శంకుస్థాపన చేయనున్నారు. కాంగ్రెస్ మంత్రులు ఇతర జిల్లాల్లో భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తున్నారు.