10-04-2025 11:18:03 AM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) గురువారం పర్యటిస్తున్నారు. మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్(Young India Police School) ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. విద్యాసంస్థ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. మంత్రి, ఎంపీలతో కలిసి ముఖ్యమంత్రి తరగతి గదులను పరిశీలించారు.