మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ దిశగా జిల్లా ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ ప్రయత్నాలు ఫలించాయి. మెదక్ జిల్లాలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై సోమవారం మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహతో కలిసి సీఎం రేవంత్ రెడ్డితో గంటకు పైగా చర్చలు జరిపారు. పలు సమీకరణాలపై సుదీర్ఘ చర్చ అనంతరం సీఎం రేవంత్ నామినేటెడ్ పోస్టుల భర్తీపై స్పష్టతనిచ్చారు. దసరా లోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ పూర్తి చేయనున్నట్లు సీఎం మంత్రి సురేఖకు తెలిపారు.