calender_icon.png 21 October, 2024 | 2:01 PM

వీరమరణం పొందిన పోలీసు కుటుంబాలకు సీఎం గుడ్ న్యూస్

21-10-2024 11:52:36 AM

హైదరాబాద్: అమరులైన కానిస్టేబుల్, ఏఎస్ఐ కుటుంబాలకు రూ. కోటి, ఎస్ఐ, సీఐ కుటుంబాలకు రూ. కోటీ 25 లక్షలు, డీఎస్పీ, ఏఎస్పీ కుటుంబాలకు రూ. కోటీ 50 లక్షలు, ఎస్పీ, ఐపీఎస్ కుటుంబాలకు రూ. 2 కోట్లు పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు సంస్మరణ కార్యక్రమంలో తెలిపారు. శాశ్వత అంగవైకల్యం పొందిన కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం, చనిపోయిన కుటుంబ సభ్యులలో ఒకరికి సర్కార్ ఉద్యోగం ఇస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. పోలీసుల పిల్లలకు చదువులు చెప్పించే బాధ్యత తమదని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మీ పిల్లలను చేర్చించవచ్చని సీఎం పేర్కొన్నారు. ఒక్క శాతం కూడా తప్పు జరగకుండా పోలీసులు వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. పోలీసుల సమస్యలను పరిష్కరించే బాధ్యత తాము తీసుకుంటామన్నారు.