calender_icon.png 15 March, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం దిష్టిబొమ్మ దహనం

14-03-2025 08:28:19 PM

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డినీ అమానుషంగా ఈ బడ్జెట్ సమావేశాలు అయ్యే వరకు సస్పెండ్ చేసినందుకు నిరసనగా సిఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బిఆర్ఎస్ నాయకులు శుక్రవారం దహనం చేశారు. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని స్థానిక తహసీలదార్ కార్యాలయం ఎదుట బి ఆర్ ఎస్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డి పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ కుమార్ మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సురేందర్  ఆదేశాలమేరకు సిఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు జలంధర్ రెడ్డి, ఎల్లారెడ్డి సొసైటీ అధ్యక్షులు ఎగుల నర్సింలు, డి సి సి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎరుల సాయిలు, శ్రవణ్ కుమార్, సొసైటీ డైరెక్టర్ దేవదాస్, ఇమ్రాన్, బరకత్ ,కృష్ణా రెడ్డి, మల్లారెడ్డి, నాగం రాజయ్య, అరవింద్ గౌడ్, బబ్లూ, విఠల్, నాగరాజు ,తదితరులు పాల్గొన్నారు.