హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క విజయవాడకు బయలు దేరారు. వీరితో పాటు మంత్రులు శ్రీథర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దీపాదాస్ మున్షీ, ఇతర నేతలు విజయవాడకు పయనం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 75వ జయంతి వేడుకలకు వారు హాజరుకానున్నారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో దేశంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, రాజకీయ నాయకులు పాల్గొంటారని తెలిపారు.